ఆలూరి విజయలక్ష్మి
ఆలూరి విజయలక్ష్మి పేరుమోసిన వైద్యురాలు, రచయిత్రి, సంఘసేవిక. ఈమె సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ అండ్ డెవెలప్మెంట్ ఆఫ్ ఉమెన్ (CEDOW) అనే స్వచ్ఛంద సేవా సంస్థను నడుపుతున్నది. జీవిత విశేషాలుఈమె లక్ష్మీ విలాసం, అట్లూరి అచ్యుతరామయ్య దంపతులకు దత్త పుత్రిక. ఈమె ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్యలను కృష్ణా జిల్లా, ఉంగుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంది.[1] ఎస్.ఎస్.ఎల్.సి.లో జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది. ఏలూరులోని సెయింట్ థెరెస్సా కళాశాలలో పి.యు.సి.చదువుకుంది. 1967లో విశాఖపట్టణంలోని ఆంధ్ర వైద్య కళాశాల నుండి ఎం.బి.బి.ఎస్. పట్టాను పుచ్చుకుంది. తరువాత 1970లో పాట్నాలోని ప్రిన్స్ వేల్స్ వైద్య కళాశాల నుండి ప్రసూతి శాస్త్రం, గైనకాలజీలు ప్రధాన అంశాలుగా ఎం.ఎస్. చదివి యూనివర్సిటీ మొదటి ర్యాంకుతో ఉత్తీర్ణురాలైంది. 1971లో రామచంద్రాపురంలో గైనకాలజిస్టుగా కొంతకాలం పనిచేసింది. తరువాత కాకినాడలో ప్రసూతి వైద్యం ప్రధానంగా నర్సింగ్ హోమ్ను నడిపి నాలుగు దశాబ్దాలకుపైగా సేవలను అందించింది. తరువాత హైదరాబాదులోని ఒక ప్రైవేటు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో ఛీఫ్ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నది.[2] వైద్యరంగంజాతీయ వైద్య జర్నల్స్లో ఈమె వ్రాసిన 4 పరిశోధనా పత్రాలు ప్రచురింపబడ్డాయి. కౌలాలంపూర్లో జరిగిన అంతర్జాతీయ గైనకాలజిస్టుల, ఒబస్ట్రీషియన్స్ల ఫెడరేషన్ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాలలో పత్రసమర్పణ గావించింది. అనేక మంది వైద్య విద్యార్థులకు ప్రసూతి శాస్త్రం, గైనకాలజీలలో శిక్షణ ఇచ్చింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, కాకినాడ యూనిట్కు అధ్యక్షురాలిగా పనిచేసింది.[2] సేవారంగంఈమె "చుండ్రు సుబ్బాయమ్మ రోటరీ ఆశ్రయం" అనే వృద్ధమహిళా ఆశ్రమాన్ని కాకినాడలో స్థాపించి అనేక మంది వృద్ధ మహిళలకు ఆశ్రయాన్ని కల్పించింది. వికలాంగ బాలికలకోసం మహర్షి సాంబమూర్తి రెసిడెన్షియల్ స్కూలు వ్యవస్థాపకులలో ఈమె ఒకరు. సత్యసాయి సేవాసమితి, కాకినాడ వారి సహకారంతో ఈమె ఉచిత ప్రసవ సేవలను, సిజేరియన్ ఆపరేషన్లను 500 మంది నిరుపేద స్త్రీలకు నిర్వహించింది. వృత్తి శిక్షణా శిబిరాలను నిర్వహించి సుమారు 1500 స్త్రీలకు, బాలికలకు శిక్షణ ఇచ్చింది. ఎన్నో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి కంటి పరీక్షలు, దంత పరీక్షలు, చర్మరోగ పరీక్షలు, గుండె పరీక్షలు, గైనిక్ పరీక్షలు చేయించి 50000 మందికి పైగా లబ్ధిని చేకూర్చింది. సుమారు 500 మంది ఉపాధ్యాయులకు బాల బాలికల కౌమార దశ పట్ల అవగాహనను కల్పించే శిక్షణను ఇచ్చింది. కౌమార బాలల ఆరోగ్యం అనే పుస్తకాన్ని రచించి 70 వేల మంది బాలబాలికలకు ఉచితంగా పంపిణీ చేసింది.[3] 1982లో చైతన్య వనితా మండలి అనే సంస్థను, 1992లో సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ అండ్ డెవెలప్మెంట్ ఆఫ్ ఉమెన్ (CEDOW) అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి నిరుద్యోగ మహిళలకు టైపు, బ్యుటీషియన్ కోర్సు, పెయింటింగ్, గృహోపకరణాల తయారీ, బుట్టల అల్లిక, కుట్టుమిషన్, దుస్తుల తయారీ, ఎంబ్రాయిడరీ, జిప్ బ్యాగుల తయారీలలో శిక్షణను ఇచ్చి వారికి ఉపాధిని కల్పించింది. సాహిత్య రంగంఆలూరి విజయలక్ష్మి తన 18వ యేటి నుండి రచనలు చేయడం ప్రారభించింది. ఈమె మొదటి కథ కాలేజి మ్యాగజైన్లో ప్రచురితమైంది. తరువాత 1962లో ఆంధ్రప్రభ వారపత్రికలో మలుపు అనే కథ ప్రచురింపబడి దీపావళి కథల పోటీలో బహుమతి లభించింది. విశాఖ రచయితల సంఘం, బలివాడ కాంతారావు, అంగర సూర్యారావు, రంగనాయకమ్మ, రాచకొండ విశ్వనాథశాస్త్రి, కాళీపట్నం రామారావు తదితరుల ప్రోత్సాహంతో విరివిగా రచనలు చేయసాగింది. ఈమె దాదాపు 150 కథలు, 5 కథా సంపుటాలు, 4 నవలలు, 3 వైద్య సంబంధ గ్రంథాలు రచించింది. కొన్ని అనువాదాలు కూడా చేసింది. ఈమె రచనలు వివిధ వార, పక్ష, మాస, దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు ఆకాశవాణి విశాఖ పట్టణం, విజయవాడ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. వనిత మాసపత్రికలో ఆరోగ్య విజయాలు అనే శీర్షికను నిర్వహించింది. రచనల జాబితానవలలు
కథా సంపుటాలు
కథలుఈమె రచించిన కథల పాక్షిక జాబితా:[4]
వైద్యవిజ్ఞాన గ్రంథాలు
అనువాద గ్రంథాలు
రాజకీయాలుజయప్రకాష్ నారాయణ్ ప్రారంభించిన లోక్ సత్తా పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరి 10 సంవత్సరాల పాటు జిల్లా కన్వీనర్గా పనిచేసింది. 2009లో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికలలో పోటీచేసి పరాజయం పొందింది.[1] పురస్కారాలు, బహుమతులు
పదవులు
మూలాలు
|