కోయంబత్తూరు-షొరనూర్ రైలు మార్గం
కోయంబత్తూరు-షోరనూర్ లైన్ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్, కేరళలోని షోరనూర్లను కలుపుతుంది. పొత్తనూర్ - కోయంబత్తూర్ - మెట్టుపాళయం, మెట్టుపాళయం నుండి ఉదగమండలం వరకు నీలగిరి మౌంటైన్ రైల్వే అనే బ్రాంచ్ లైన్ ఉంది. ఈ నెట్వర్కు, కేరళలోని రైల్వే నెట్వర్కును పాలక్కాడ్ గ్యాప్ ద్వారా తమిళనాడులోని నెట్వర్క్కు కలుపుతుంది. చరిత్ర1856లో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రైలు సేవ, భారతదేశంలో మూడవది మద్రాసు రైల్వే ద్వారా రాయపురం నుండి వాలాజా రోడ్ వరకు మొదలైంది. మద్రాస్ రైల్వే 1861 లో దాని ట్రంక్ మార్గాన్ని కోజికోడ్ వరకు విస్తరించింది. [1] పోదనూరు-మెట్టుపాళయం లైను 1873లో ట్రాఫిక్కు తెరవబడింది. యునెస్కో హెరిటేజ్ ట్రాక్, నీలగిరి మౌంటైన్ రైల్వేను రెండు దశల్లో ప్రారంభించారు. మెట్టుపాళయం-కూనూర్ సెక్షన్ను 1899లో ప్రారంభించారు. 1908లో దీన్ని ఉదగమండలం (ఊటీ) వరకు విస్తరించారు [2] [3] వేగ పరిమితికోయంబత్తూర్-షోరనూర్ లైన్ను "గ్రూప్ B" గా వర్గీకరించారు. ఇక్కడ వేగం 130 కిమీ/గం వరకు ఉంటుంది. ప్రస్తుతం అనుమతించిన గరిష్ట వేగం, పాలక్కాడ్ షోరనూర్ సెక్షనులో 110 కిమీ/గం. [4] ఈ లైన్లో ఉన్న కోయంబత్తూర్, పాలక్కాడ్ స్టేషన్లు భారతీయ రైల్వేల టాప్ వంద బుకింగ్ స్టేషన్లలో ఉన్నాయి. [5] ఇటీవలి వర్గీకరణ ప్రకారం కోయంబత్తూరును NSG-1గా వర్గీకరించారు. మూలాలు
|