చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ (2019 నుండి అధికారికంగా పురచ్చి తలైవర్ డాక్టర్ ఎం.జి. రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్; "పేర్లు" చూడండి) చెన్నైలో గల ప్రధాన రైల్వే స్టేషన్. ఇది దక్షిణ భారతదేశం లో గల అత్యంత ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దక్షిణ భారతదేశంలో గల అత్యంత రద్దీ గా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది చెన్నై నగరపు ప్రధాన ఆనావాళ్ళలో ఒకటి.దీనిని 1873 లో జార్జ్ హార్డింగ్ అనే వాస్తుశిల్పి రూపొందించాడు. మరల దీనికి 1959 లోను, 1998 లో మార్పులు చేసారు. ఇక్కడ నుండి ప్రతిదినం సుమారు 3,50,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ద్వార సుమారు 269 రైళ్ళు తమ ప్రయాణాన్ని ప్రారంభించడం / ముగించడం /ఈ రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించడం జరుగుతుంది.సుమారు 644 రైల్వే స్టేషన్లు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ తో అనుసంధానించబడినవి. ఇది దేశంలో 28వ రద్దీగా ఉండే స్టేషను.[1] పేర్లు
చరిత్రభారతదేశంలో రైల్వేలు మొదలయిన తరువాత దక్షిణ భారతదేశం లో మద్రాసు రైల్వే కంపెని రైల్వేలను నిర్వహించేది . మొదటగా రాయపురం రైల్వే స్టేషన్ ను 1856 లో నిర్మించారు. అది కొంతకాలం మద్రాసు నగరానికి ప్రధాన రైల్వే స్టేషన్ వుండేది. తరువాత రైల్వేలను విస్తరించినప్పుడు మద్రాసు రైల్వే స్టేషన్ (పార్క్ రైల్వే స్టేషన్) ను 1873 లో నిర్మించారు. 1907 లో మద్రాసు రైల్వే కంపెని మద్రాసు సెంట్రల్ రైల్వేస్టేషన్ ను ప్రధాన రైల్వే స్టేషన్ గా మార్చింది . 1922 లో దీనిని మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వేలతో అనుసందానించి మద్రాస్ సెంట్రల్ రైల్వేస్టేషన్ ను వాటికి ప్రధాన కేంద్రం గా ఏర్పాటు చేసారు.తరువాత మద్రాసు రైల్వే కంపెని దక్షిణ భారత రైల్వే కంపెని లో విలీనం అయింది. దక్షిణ భారత రైల్వే 1853 లో బ్రిటన్ లో స్థాపించబడి, బ్రిటిష్ వలస పాలనలో 1859 లో రిజిస్టర్ గావించబడి. గ్రేట్ దక్షిణ భారతదేశం రైల్వే (కంపెనీ) కం.గా రూపొందింనది. దీనిని తిరుచిరాపల్లి (ట్రిచ్చి) లో ప్రధాన కార్యాలయంగా 1890 లో లండన్ లో కేవలం ఒక సంస్థగా నమోదు చేశారు. ప్లాట్ఫారములుచెన్నై సెంట్రల్ రైల్వేస్టేషనులోని 17 ప్లాట్ఫారములు కలవు .వీటిలో 12 ప్రధానంగా ఎక్స్ప్రెస్ రైలుబండ్ల కు మిగిలినవి సబర్బన్ రైళ్ళకు కేటాయించారు. 12 ప్రధాన ప్లాట్ఫారములు 24 కంటే ఎక్కువ బోగీలు కల ఎటువంటి రైలుబండి నయినా కూడా తీసుకుని, నిర్వహించగలవు. . అన్ని ట్రాక్లను బ్రాడ్గేజ్గా మార్చబడనవి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించు రైళ్ళు తమ దిశను మార్చుకుని ప్రయాణించవలసిరావడం వల్ల అవి అధిక సమయం తీసుకుంటాయి. ప్రయాణీకుల సౌకర్యాలుఈ స్టేషనులో లాడ్జింగ్ (బస), రెస్టారెంట్లు, కేఫ్లు, కాఫీ షాప్, బుక్ స్టాల్స్ (పుస్తకం దుకాణాలు), వెయిటింగ్ హాల్స్ (వేచి ఉండు మందిరాలు), క్లోక్ రూములు (అంగీ గదులు), సైబర్ కేఫ్ వంటి అనేక సౌకర్యాలు, పర్యాటక ఎజెంట్ కౌంటర్లు, రైలు విచారణ కౌంటర్లు, రైలు స్థితి ప్రదర్శన (డిజిటల్) బోర్డులు, రైలు స్థితి ప్రకటనలు, లిఫ్ట్ బ్రిడ్జి (అడుగు వంతెన) లు మొదలైనవి ప్రయాణికులు ఉపయోగించుకోవడం కోసము ఏర్పాట్లు ఉన్నాయి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో గల ప్రధాన వేచియుండు మందిరం లో (వెయిటింగ్ హాల్స్) లో సుమారు 1000 మంది వేచివుండవచ్చు. ప్రయాణికులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే తక్షణం ప్రాథమిక చికిత్స చేసేందుకు ఇక్కడ అత్యవసర వైద్యశాల కలదు. ఇవది 24గంటల పాటు ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి బయలు దేరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ , ఎక్స్ప్రెస్ రైళ్లు
మూలాలు
బయటి లింకులు
|