పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank - PNB)ను 1895లోలాహోర్ లో లాలా లజపతి రాయ్ గారు స్థాపించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4500 పైగా శాఖలతో రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ వాణిజ్య బ్యాంకుగా కొనసాగుతున్నది. భారతీయులు భారతదేశంలో స్థాపించిన బ్యాంకులలో ఇది మొదటిది. 1969, జూలై 19 నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం జాతీయం చేయబడిన 14 బ్యాంకులలో ఇది ఒకటి[1].
చరిత్ర
భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1895 ఏప్రిల్ 12 న లాహోర్ లొ రూ .2 లక్షల అధీకృత మూలధనం, రూ .20,000 వర్కింగ్ క్యాపిటల్ తో తన కార్యకలాపాలను ప్రారంభించింది. లాలా లజపతిరాయ్, ఇ.సి.జెస్సావాలా, బాబూ కాళీ ప్రసోనో రాయ్, లాలా హర్కిషన్ లాల్, సర్దార్ దయాల్ సింగ్ మజిథియా వంటి దేశభక్తులు భారతీయులు నిర్వహించే మొదటి బ్యాంకును స్థాపించడం ద్వారా వ్యక్తీకరించడంలో ధైర్యాన్ని ప్రదర్శించారు.
1882 నాటి ఇండియన్ కంపెనీల చట్టం VI ప్రకారం ఏర్పాటైన ఈ బ్యాంకు వివేకవంతమైన బ్యాంకింగ్ సాంప్రదాయిక వ్యవస్థతో దేశంలోని ప్రధాన బ్యాంకింగ్ సంస్థలలో ఒకటిగా తనను తాను దృఢంగా నిలిచింది.బ్యాంకు చరిత్రలో వివిధ కాలాల్లో 7 ప్రైవేటు రంగ బ్యాంకులను స్వాధీనం చేసుకోవడం/విలీనం చేయడం ద్వారా బ్యాంకు అభివృద్ధికి దోహద పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో గణనీయమైన పురోగతిని సాధించి తన వినియోగదారులకు సేవలను అందిస్తున్నది[2].