కవర్ధా
కవర్ధా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కబీర్ధామ్ జిల్లాలోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. పట్ట పాలనను పురపాలక సంఘం చూస్తుంది. కవర్ధా "భోరమ్దేవ్ దేవాలయాని" కి ప్రసిద్ధి చెందింది. చరిత్ర1751 లో మొదటి పాలకుడు మహాబలి సింగ్ కవర్ధా రాజ్యాన్ని స్థాపించాడు. బ్రిటిష్ రాజ్ సమయంలో, ఇది కవర్ధా సంస్థానానికి రాజధానిగా ఉండేది. [1] 1806 లో కబీర్ పంత్ యొక్క ఎనిమిదవ గురువైన హక్ నామ్ సాహెబ్ ఇక్కడ గురు గద్దీని స్థాపించాడు. 1936 లో స్వాతంత్ర్యానికి ముందు కవర్ధా పట్టణం మునిసిపాలిటీగా మారింది. పట్టణంలో ప్రసిద్ధ భోరమ్దేవ్ ఆలయం ఉంది. భౌగోళికంకవర్ధా 22°01′N 81°15′E / 22.02°N 81.25°E వద్ద ఉంది. [2] సముద్రమట్టం నుండి దీని ఎత్తు 353 మీటర్లు (1,158 అ.) . జనాభా2011 భారత జనగణన ప్రకారం [3] కవర్ధాా జనాభా 44,205. జనాభాలో పురుషులు 52%, మహిళలు 48% ఉన్నారు. కవర్ధా సగటు అక్షరాస్యత 66%. ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 76%, స్త్రీల అక్షరాస్యత 55%. కవర్ధా జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. మూలాలు
|