Share to:

 

తుని రైల్వే స్టేషను

తుని రైల్వే స్టేషను
ప్రయాణీకుల రైల్వే స్టేషను
General information
Locationతుని , కాకినాడ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates17°21′39″N 82°32′33″E / 17.360934°N 82.542548°E / 17.360934; 82.542548
Elevation24 మీ. (79 అ.)
Owned byభారతీయ రైల్వేలు
Operated byదక్షిణ మధ్య రైల్వే జోన్
Line(s)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
Platforms2
Tracks3 బ్రాడ్ గేజ్
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Parkingఉంది
Other information
Statusపనిచేస్తున్నది
Station codeTUNI
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
History
Opened1899
Electrified25 కెవి ఎసి 50 Hz OHLE


తుని రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ కాకినాడ జిల్లా లోని తుని నగరంలో ఉన్న ఒక రైల్వే స్టేషను.[1] ఇది విజయవాడ-చెన్నై రైలు మార్గములో ఉంది. ఇది భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజను ద్వారా నిర్వహించబడుతుంది. ప్రతిరోజు 98 రైళ్లు ఈ స్టేషన్లో ఆగుతాయి.[2] ఇది దేశంలో 214వ రద్దీగా ఉండే స్టేషను.[3]

చరిత్ర

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[4] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే తీసుకుంది. [5]

ధూమ శకటాలు (ఆవిరి యంత్రాలు) ఇంకా బాగా చలామణీలో ఉన్న రోజులలో విశాఖపట్నం తరువాత తుని లోనే ఆహారం అందుబాటులో ఉండేది అందుకే నీళ్ళు తాగడానికి తునిలో ప్రతి రైలు బండి విధిగా కనీసం పదిహేను నిమిషాలు ఆగవలసి వచ్చేది. అంతే కాకుండా మద్రాసు మెయిలు (2 అప్), హౌరా మెయిలు (1 డౌన్), రెండూ మధ్యాహ్నం భోజనాల వేళకి తునిలో ఆగేవి. అలాగే సాయంకాలం భోజనాల వేళకి నైన్ డౌన్, టెన్ అప్ ఆగేవి. ఒక్క మొదటి తరగతి ప్రయాణీకులకి తప్ప భోజనం రైలు పెట్టెలోకే సరఫరా అయే సదుపాయం ఆ రోజులలో ఉండేది కాదు. కనుక తుని ‘మీల్స్ హాల్ట్’. తునిలో భోజనం బాగుండేదని ఉత్తరాది వారు, దక్షిణాది వారు కూడా చెప్పేవారు.

వర్గీకరణ

తుని రైల్వే స్టేషను ఒక 'ఎ' కేటగిరి స్టేషను. ఇది విజయవాడ రైల్వే డివిజన్లో ఒక మోడల్ స్టేషను, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.ఆదాయాలు, ప్రయాణీకుల నిర్వహణ పరంగా, ఈ తుని రైల్వే స్టేషను నాన్-సబర్బన్ గ్రేడ్-3 (ఎన్.ఎస్.జి-3) రైల్వే స్టేషన్‌గా వర్గీకరించబడింది.2022–23 కాలానికి భారతీయ రైల్వే స్టేషన్‌ల పునః-వర్గీకరణ ఆధారంగా, ఎన్.ఎస్.జి–3 కేటగిరీ స్టేషన్ ₹20₹100 కోట్ల మధ్య సంపాదిస్తుంది. 5–10 million మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది.[6] భారతీయ రైల్వే స్టేషన్ల అప్‌గ్రేడేషన్ పథకమైన ఆదర్శ్ స్టేషన్ స్కీమ్ కోసం ఎంపిక చేయబడింది.[7][8] [9][10]

మూలాలు

  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 46. Retrieved 31 May 2017.
  2. "Statement showing Category-wise No.of stations" (PDF). p. 7. Retrieved 18 January 2016.
  3. "BUSIEST TRAIN STATIONS INDIA". Archived from the original on 2018-06-12. Retrieved 2018-06-08.
  4. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-06-08.
  5. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  6. "Categorization of Railway Stations". Press Information Bureau. 21 March 2018. Retrieved 2022-10-18.
  7. "Adarsh Railway Station Scheme". Press Information Bureau. 5 April 2017. Retrieved 2022-10-18.
  8. "Adarsh Stations" (PDF). Portal of Indian Railways. Retrieved 2022-10-18.
  9. "Vijayawada division – A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
  10. "Jump in SCR Vijayawada division revenue". The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015.

బయటి లింకులు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే
Prefix: a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9

Portal di Ensiklopedia Dunia

Kembali kehalaman sebelumnya